అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు భరోసానిచ్చిన మాకినీడి దంపతులు

యు. కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో సోమవారం పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి.. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని.. శేషుకుమారి హస్బెండ్ డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ గారిని వారి ని దగ్గరకి పంపి మెరుగైన వైద్యం అందించే విధంగా చూసుకుంటానని భరోసా కల్పించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. దీనిపై జనసేన ఇంచార్జ్ ఈ సమస్యలపై ఒక డేటాని సేకరించే పనిలో ఉన్నారని మీకు త్వరగా న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు. కొత్తపల్లి మండలం అధ్యక్షులు పట్టా శివ, దొడ్డి దుర్గాప్రసాద్, వంకా కొండబాబు, పుణ్య మంతుల బాబురావు, మైనంపల్లి రాజు ప్రతాప్, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.