ప్రజలపై మరింత భారాన్ని రుద్దుతున్నారు: దారం అనిత

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచిన విషయం అందరికీ తెలిసినదే. డీజిల్ రేటు పెరగడంతో ఆర్టీసీ 20 కోట్లు నష్టాలతో నడుస్తున్న తరుణంలో బస్సు రేటు పెంచామని గవర్నమెంట్ చెబుతుంది. ఈ సమయంలో ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు, ఆర్థికంగా అయితే చాలా బలహీన పడ్డారు. ఈ గవర్నమెంట్ ఎలాంటి ఉపాధి అవకాశాలను ఆర్థిక వనరులను సమకూర్చి ప్రజల జీవన ప్రమాణం రేటును పెంచకపోగా.. బాదుడే బాదుడు అని అన్ని విధాలుగా రేట్లు పెంచి భరించండి అంటూ.. భారాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఇప్పుడు అమలు చేయకపోగా.. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టే సారు. పల్లె వెలుగు బస్సు ఎక్కితేనే 10 నుండి 15 రూపాయలు బస్ చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వం. వన్ ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కితే ఇంక దాని యొక్క పెంపు ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఎలా భరించాలి, ఎలా బతకాలి. ప్రజలు ఈ బాధలను భరించలేక పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి వచ్చింది. జాబ్ క్యాలెండర్ లేదు, కరెంటు లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు ఈ విధంగా ఉంది ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి. ఓటు వేసిన పాపానికి ప్రజలపై భరించలేని బారాలు మోపుతోంది. ప్రభుత్వ ప్రెస్ మీట్ లు మాత్రం ప్రతిపక్షాలను వ్యక్తిగత విమర్శలు చేయడానికి మాత్రమే ఉంటాయి.. ఇప్పుడు చేయండి పాదయాత్ర ప్రజలు ఎలా ఉన్నారు మీ ప్రభుత్వం పై ప్రజల స్పందన అర్థమవుతుంది అని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ప్రభుత్వం లోని లోపాలను ఎత్తి చూపారు.