జనం వద్దకు జనసేన..!

*మీ సమస్య పరిష్కారం కోసం మేము పోరాడుతాం!: జనసైనికులు

పార్వతీపురం పట్టణంలో జనం వద్దకు జనసేన కార్యక్రమాన్ని గురువారం, వారపు సంతలో జనసైనికులు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికులు ప్రజల దగ్గరికి వెళ్లి ఏవైనా సమస్యలుంటే చెప్పండి, మీ సమస్య పరిష్కారం కోసం మేము పోరాడుతామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా జనసేన పార్టీ నాయకులు వంగల నాయుడు, కాతా విశ్వేశ్వరరావు, బోనెల చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రకటించిన షణ్ముఖ వ్యూహం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో, పట్టణాలలో వ్యక్తిగత, ఊర్ల కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తమకు ఫోన్ చేస్తే.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా వారపు సంతలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పార్వతీపురం జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల పరిస్థితులు, సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారపు సంతకు వచ్చిన వారు పలు సమస్యలను జనసైనికులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రోడ్లు, రహదారులు, తాగునీరు, విద్యుత్తు, అధిక ధరలు తదితర వాటిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. వైసిపి పాలనలో రాష్ట్రం అప్పులు ఆంధ్రాగా మారిందని, మరో శ్రీలంక కాబోతుందన్నారు. ఈ విషయంలోనే తమ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ అప్పులు లేని ఆంధ్రా రాష్ట్రాంగా తీర్చిదిద్దేందుకు షణ్ముఖ వ్యూహాన్ని ప్రకటించారన్నారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రశ్నించాలని, లేదంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు.