మంత్రి కన్నబాబు వ్యాఖ్యలను ఖండించిన గంధం శెట్టి దినకర్ బాబు

జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రెండవ విడత కౌలు రైతుల భరోసా యాత్రపై రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు విమర్శలు చేయడం ఖండిస్తున్నామని రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు స్పష్టం చేశారు.. కౌలు రైతుల అకాల మరణం తీవ్ర బాధాకరమైన విషయమని ఆ రైతు కుటుంబాల తాత్కాలిక సంతోషం కోసం.. ఒక భరోసా కల్పించే నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు పశ్చిమగోదావరి జిల్లాలో ఏప్రిల్ 23వ తేదీన కౌలు రైతు భరోసా యాత్రలు ప్రారంభిస్తున్న సందర్భంగా… రైతులు సంతోషంగా ఉన్నారని కన్నబాబు గారు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులంతా సంతోషంగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదు.. మేము చేస్తేనే రాజకీయం అనడం దురదృష్టకరమన్నారు.. కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు కలిపి ఇచ్చే 30 వేల రూపాయలను, రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో ఇచ్చే 32500 కలిపి చూపించడం హాస్యాస్పదం అన్నారు.. మీ ప్రభుత్వ పాలనలో కౌలు రైతులు ఆనందంగా ఉండుంటే మరి మా సొంత నిధులు ఖర్చు చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ఇంత బాధ అని విమర్శించారు.. రైతులకు న్యాయంగా వైసిపి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, కౌలు రైతుల అకాల మరణం వారి కుటుంబానికి తీవ్ర ఆవేదన కలిగించకుండా వారికి రావాల్సిన తక్షణ సహాయం ని ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.