రైతు భరోసాయాత్రను జయప్రదం చేయండి: వీరమళ్ళ బాలాజీ
ఏప్రిల్ 23, శనివారం ఉ.గం.8.30 ని.లకు ఏలూరు బైపాస్ రోడ్ నుండి జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ప్రారంభమై… ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడి వరకూ సాగుతుంది. ఈ యాత్రలో జనసేన పార్టీ అధ్యక్షులు పవణ్ కళ్యాణ్ గారు పాల్గొని ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేయుచున్నారు. అనంతరం చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున నిడదవోలు మండల.. గ్రామ అధ్యక్షులు, రైతులు, జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు, వీరమహిళలు, ఎంపీటీసీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, అందరూ పాల్గొని జనసేన పార్టీ “రైతు భరోసాయాత్ర”ను జయప్రదం చేయగలరు అంటూ.. జనసేన పార్టీ ఉండ్రాజవరం మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-8.59.30-AM.jpeg)