టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2020 సీజన్ను ఓటములతో ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్రైడర్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మిడిలార్డర్ వైఫల్యంతో బెంగళూరు చేతిలో ఓడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. శనివారం కోల్కతాపై నెగ్గి లీగ్లో బోణీ చేయాలని భావిస్తున్నది. అబుదాబిలోని షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జట్లు ఈ మ్యాచ్లో మార్పులుచేర్పులు చేశాయి. హైదరాబాద్ జట్టులో మార్ష్ స్థానంలో నబీ, విజయ్ శంకర్ స్థానంలో సాహా, సందీప్ శర్మ స్థానంలో ఖలీల్ ఆడనున్నారు. ఇక.. నైట్రైడర్స్ టీంలో కూడా ఇద్దరు ఆటగాళ్లను తీసుకున్నారు. సందీప్, నిఖిల్ స్థానంలో నగర్కోటి, వరుణ్ ఆడనున్నారు.