అగ్ని ప్రమాద బాదిత కుటుంబాన్ని ఆదుకున్న జనసేన నాయకులు

ఆముదాలవలస నియోజకవర్గం, కురంపేట గ్రామంలో ఇటీవలే వడ్రంగి దుకాణం పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదం కారణంగా దుకాణంలో దాదాపుగా 3లక్షలు వరకు ఆస్తినష్టం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర మరియు ఎంపీటీసీ సిక్కోలు విక్రమ్, ఎంపీటీసీ అభ్యర్థి శివ, సంగం నాయుడు సంఘటన స్థలానికి చేరుకొని వారికి జనసేన పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చి.. ఆ కుటుంబానికి కొంత ఆర్దికం సాయం మరియు నిత్యావసర సరుకులు అందించారు.. భవిష్యత్తు లో జనసేన పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుంది అని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంతోష్ నాయుడు, శ్రీను, రమేష్ ప్రదీప్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.