జనసేన పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది: బొబ్బేపల్లి సురేష్ బాబు

సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఇనుకుర్తి గ్రామం నందు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు పర్యటించి అక్కడ స్థానికంగా ఉన్న హరిజనవాడ కి సంబంధించిన కొంత మందిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా 35 కుటుంబాలు నివాసం ఉంటున్న హరిజనవాడకు సంబంధించిన వారు కాలం చెల్లితే స్మశానానికి వెళ్లాలంటే ఒక కిలోమీటరు దూరం వెళ్ళాలి కిలోమీటర్ కూడా వెళ్లడానికి దారి లేదు గొయ్యలు గుంటలు మీద పొలం గట్ల మీద వెళ్లాలి. పొలాలకు సంబంధించిన వారు పొలం వేసుకుంటే కనీసం వెళ్లడానికి కూడా మార్గంలేని పరిస్థితి. కనీసం స్మశానానికి సంబంధించినటువంటి కనీస స్థలం కూడా లేని పరిస్థితి అకాల వర్షాలు వస్తే వాళ్ల బాధలు వర్ణనాతీతం పొదలకూరు మండలం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత మండలం మరి మంత్రి చూస్తే నేను అభివృద్ధి చేశాను సర్వేపల్లి నియోజకవర్గాన్ని అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చూస్తే కనీసం బడుగు బలహీన వర్గాలకు స్మశానాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మాకు తెలిసింది దయచేసి ప్రభుత్వం గాని ప్రభుత్వ అధికారులు గాని మీకు ఎన్నో సార్లు హరిజనవాడ ప్రజలు వినతిపత్రాలు ఇచ్చిన వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదు ఇకనైనా వాళ్ల సమస్యని పరిష్కరించండి అలా జరగని పక్షంలో వాళ్లకు అండగా నిలబడి సమస్య పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే అంతవరకు జనసేన పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ వంశీ కార్తీక్ శివ ఆకాష్ శశి అజయ్ మోహిత్ సందీప్ శ్రీహరి వంశీ తదితరులు పాల్గొన్నారు.