సి.పీ.ఎస్ విధానాన్ని రద్దు చేసే ఆలోచన ఉందో లేదో సిబిఐ దత్తపుత్రుడు చెప్పాలి: దారం అనిత

చిత్తూరు: నాలుగు వేల మంది పోలీసులతో విజయవాడ తాడేపల్లి ప్రాంతాలను అష్టదిగ్బంధం చేసి యూ.టి.ఎఫ్ ఉద్యోగులను ఎక్కడి కక్కడ అరెస్టులు చేసి, కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడి అడ్డుకునేందుకు చేపట్టిన కార్యక్రమానికి భగ్నం చేస్తూ.. పోలీసులు విజయవాడ తాడేపల్లి కి వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్ట్ లు పెట్టి.. ప్రతి వాహనాన్ని ఆపి.. ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు గుర్తింపు తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సి వ్యతిరేకిస్తూ ఎన్ని ఆంక్షలు విధించినా చలో విజయవాడకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉప్పెనలా తరలి వచ్చారు. కొంతమంది ఉపాధ్యాయులు విజయవాడ పాత ఆసుపత్రి ప్రభుత్వాసుపత్రికి రోగుల మాదిరిగా వచ్చే వారిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. జాతీయ రహదారి నుండి సర్వీస్ రోడ్డుకి వెళ్లే చోట ముళ్ళ కంచె వేయడంతో వాటిని దాటడానికి ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జామ్ అయి ఉండటంతో వాహనాలలోని ప్రజలు మండుటెండకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఈ విధంగా నెరవేర్చని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పలురకాలుగా ముప్పుతిప్పలు పెడుతోందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.