పోలవరం నడిబొడ్డున పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం
పోలవరం: జనసేన కౌలురైతు బరోసా యాత్రలో భాగంగా ఇటీవల ఉభయ పశ్చిమగోదావరిజిల్లా, చింతలపూడి బహిరంగ సభలో 41 మంది బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంభాలకు జనసేనాని పవన్కళ్యాణ్ లక్ష రూపాయల ఆర్ధికసాయం అందించిన విషయం అందరికీ విదితమే.. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహాయం పొందిన పోలవరం నియోజకవర్గం, పోలవరం మండల 6గురు రైతుల కుటుంభ సభ్యులు కృతజ్ఞతగా పోలవరం నడిబొడ్డున పవన్ కళ్యాణ్గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే రెండు కొత్త మరణాలు ఇదే మండలంలో నమోదైనందున వారికి కూడా లక్ష రూపాయలు అందించడం జరుగుతుందని ఇంచార్జి చిర్రి బాలరాజు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జి చిర్రి బాలరాజు, జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం నాగకృష్ణ, మండల అద్యక్షులు గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ (చిన్ని ), కరిబండి రాజు, కురసం రమేష్, తెలగంశెట్టి రాము, బాలయోగి, మామిడిపల్లి ప్రసాద్, మరియు మండల జనసేన కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై కార్యక్రమం విజయవంతం చేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-28-at-9.01.08-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-28-at-9.01.08-PM-1-1024x461.jpeg)