పాటంశెట్టి నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన కందుల

జగ్గంపేట నియోజకవర్గం, గోకవరం మండలంలో అచ్యుతాపురం గ్రామ సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జగ్గంపేట ఇంచార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర కు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజానగరం ఇంచార్జ్ మేడా గురుదత్త ప్రసాద్, అనపర్తి ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, పెద్దాపురం ఇంచార్జ్ తుమ్మల బాబు, జిల్లా అధికార ప్రతినిధులు నారాయణ గౌడ్, శ్రీమతి తోలేటి శిరీష, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు సెప్పా చిన్నారావు, రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు దాసరి గుర్నాథం, వీర మహిళలు, జనసైనికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

\