షణ్ముఖ వ్యూహం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మర్రపు సురేష్

విజయనగరం జిల్లా, గజపతినగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనంలోకి జనసేన ప్రజా సమస్యల పై పోరాటం కార్యక్రమం చేపట్టిన జనసేన నియోజకవర్గ సీనియర్ నాయకులు మార్రపు సురేష్ గజపతినగరం నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్లి జనసేన పార్టీ సిద్ధాంతాలు.. రేపు జనసేన పార్టీ అధికారంలోకి రాగానే చేసే కార్యక్రమాలు వివరించడం జరుగుతుంది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేస్తుంది, అలాగే జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా ప్రజల్ని మేలు జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఆయన సిద్ధాంతాలు వివరించడం జరుగుతుంది.

ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గం నాయకులు మర్రపు సురేష్ మాట్లాడుతూ.. జనసైనికులు అందరం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు గౌరవిస్తూ జనసేన పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న కాలంలో రాక్షసపాలన కాకుండా రామరాజ్యం వచ్చే విధంగా పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.