శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న మాకినీడి

గొల్లప్రోలు మండలం, వన్నెపూడి గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి శ్రీశ్రీశ్రీ గంగాలమ్మ జాతర మహోత్సవానికి వెళ్లి, అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని, అమ్మవారి బోనాలు కార్యక్రమంలో అక్కా, చెల్లెమ్మల తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి 5000 వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వన్నెపూడి గ్రామ నాయకులు, జనసైనికులు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరాది వల్లీ రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.