నూజివీడు జనసేన ఆధ్వర్యంలో మే డే వేడుకలు

నూజివీడు, మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికుల సంఘం (ఏ.ఐ.టి.యు.సి) ఆధ్వర్యంలో నూజివీడు మండలం పాత రావిచేర్లలోని పంచాయితీ కార్యలయం వద్ద ఉన్న జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల ఆహ్వానం మేరకు పాల్గొని కార్మిక సోదరులకు 136వ మే డే శుభాకాంక్షలు తెలియచేసి, కార్మికుల సమస్యలు, హక్కుల కోసం చేసే పోరాటాలకి జనసేన పార్టీ మద్దతు ఉంటుందని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.టి.యు.సి రాష్ట్ర నాయకులు చలసాని రామారావు, జనసేన కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, సి.పి.ఐ టౌన్ కార్యదర్శి చాట్ల పుల్లారావు, మాజీ గ్రామ సర్పంచ్ బసవరాజు నగేష్ బాబు, గ్రామ జనసేన నాయకులు తోట మల్లేశ్వరావు, తోట శ్రీనివాసరావు, అంజి బాబు, బలరామ్, అశోక్, పసుపులేటి నాగు, చెలికాని సాయి, కోన్నంగుంట ప్రసాద్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తోట సీతారామరాజు, కొత్తేం పెద్దపుల్లయ్య, చిన్నం రాంబాబు, హెల్పింగ్ హ్యాండ్స్ నూజివీడు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి మరీదు నాగ మల్లేశ్వరరావు తదితరుల పాల్గొన్నారు.