గాలి వానకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకొన్న జనసేన కార్యదర్శి కొట్టే సాయి

తొట్టంబేడు మండలం, పెంకలపాడు గ్రామంలో ఆదివారం కురిసిన గాలి వానకు పెంచలయ్య, పోలమ్మ ఇల్లు కూలి పోయింది. ఈ విషయాన్ని స్థానిక జనసైనికులు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొట్టే సాయి దృష్టికి తీసుకురావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కొట్టే సాయి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వాళ్లకు సాయం చేయడం జరిగింది. భవిష్యత్తు లో కూడా మీకు ఏ సహాయం కావాల్సినా జనసేన పార్టీ మీకు తోడుగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, మాధవ్ మహేష్, ఈర్ల చిరంజీవి రామ్, శివ శంకరయ్య,భాను,కుమార్, చంద్రయ్య,సాలయ్య, తదితరులు పాల్గొన్నారు.