వివాహానికి ఆర్థిక సహాయం చేసి పట్టుచీర అందించిన పెండ్యాల దంపతులు

అనంతపురం అర్బన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి పెండ్యాల శ్రీలత, జిల్లా నాయకులు పెండ్యాల హరి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నారాయణపురం పంచాయతీ భువనేశ్వర్ నగర్ కు చెందిన జనసేన కార్యకర్త సురేంద్ర, ప్రమీల దంపతుల కుమార్తె పద్మావతి వివాహానికి రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా నూతన వధువు పద్మావతి మాట్లాడుతూ… గత రెండు నెలల క్రితం మా నాన్న సురేంద్ర ఆకస్మికంగా మృతి చెందారని.. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమకు పెండ్యాల దంపతులు అండగా నిలిచారన్నారు. క్లిష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచి రెండు నెలల క్రితం మా కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించారన్నారు. ఆ తర్వాత వివాహ విషయం వారి దృష్టికి రావడంతో తాము అన్నివిధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు. ఇంటి ఆడబిడ్డగా పట్టుచీర పెట్టి, రూ 10,000 ఆర్థిక సహాయం చేశారని.. ఇబ్బందుల్లో ఉన్న జనసేన కార్యకర్త కుటుంబానికి పెండ్యాల దంపతులు ఇస్తున్న చేయూత మరువలేనిదన్నారు. అనంతరం జనసేన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ… తమ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. జనసేన కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు మురళి, జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీరమహిళ కాశెట్టి సావిత్రి, నాయకులు తోట ప్రకాష్, దండు హరీష్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.