జనసేన పార్టీ బలోపేతం లక్ష్యంగా సిధ్ధవటం మండలంలో గ్రామాల పర్యటన
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిధ్ధవటం మండలం, వెంగటాయపల్లి పంచాయతీ: జనసేన పార్టీ బలోపేతం కొరకు సిధ్ధవటం మండలంలో గ్రామాల పర్యటన చేస్తున్న జనసేన నాయకులు ముందుగా వెంగటాయపల్లి పంచాయతీ నుంచి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించగా.. ఆ గ్రామ ప్రజలు వారి సమస్యలు తెలియజేశారు.. 10కి.మీల దూరంలో కడప వుంటే రహదారి లేక 40కి.మీ లు సిధ్ధవటం వయా భాకరాపేట మీదుగా ప్రయాణం చేయవలసి వస్తుందని.. వారికి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయించాలని గ్రామ ప్రజలు జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్య పై జనసేన నాయకులు స్పందిస్తూ..
ఖచ్చితంగా జనసేన పార్టీ మీ పక్షాన పోరాడుతుంది లేని పక్షంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సీయం అయిన వెంటనే మీ రహదారి ఏర్పాటు చేయిస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 14,15 ఆర్థిక సంఝం మరియు వెనుకబడిన ప్రాంతం కింద ఈ యాడాది మీ పంచాయతీ కీ 10లక్షల రూపాయలు కేంద్రం కేటాయిస్తే.. కేవలం లక్షరూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్టు చూపిస్థున్నారని మిగతా డబ్బులు ఎక్కడికి పోయాయని గ్రామ ప్రజలు సర్పంచ్ ని నిలదీయాలని జనసేన నాయకులు చెప్పడం జరిగింది. జనసైనికులతో పార్టీ బలోపేతం పై చర్చిస్తూ.. గ్రామ భూతు కమిటీలు ఏర్పాటు చేసి, ఈ పంచాయతీ లో పార్టీ ని బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు మాజీ ఆర్టీసీ ఎండీ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు సాయిక్రిష్ణ, సిధ్ధవటం మండల నాయకులు కొట్టే. వెంకట రాజేష్, సిధ్ధవటం పంచాయతీ వార్డుమెంబర్లు పసుపు లేటి కళ్యాణ్, గ్రామ జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-04-at-2.19.12-PM-1024x473.jpeg)