ఏటిమొగ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రధానం

జనసేన పార్టీ జిల్లా కార్యనిర్వహణ సభ్యులు కర్రి నాని ఆధ్వర్యంలో ఏటిమొగ ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 11 టీంలు పాల్గొనగా, రెండు టీమ్స్ ఫైనల్స్కి చేరుకున్నాయి. అందులో భాగంగా రెండు టీమ్స్ ఫైనల్కి చేరగా, చివరికి ఫ్రెండ్ సర్కిల్ టీం విన్నర్స్ గా, వెస్టిండీస్ టీం రన్నర్ గా నిలిచారు. వారందరికీ మెమెంటో మరియు మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వహణ సభ్యులు కర్రి నాని ఆహ్వానం మేరకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా కార్యదర్శి అట్లా సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, మత్స్యకార నాయకులు మడ్డు విజయ్, మోస ఏసేపు, ఆకుల శ్రీనివాస్, ధోని, శ్రీను, జాక్, ధర్మ, దుర్గ, ఆదినారాయణ, వీర మహిళలు లీల, బెజవాడ చిన్నారి తదితరులు పాల్గొనడం జరిగింది.