బిక్కవోలు జనసేన ఆధ్వర్యంలో చల్లని చలివేంద్రం

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రయాణికులకు చల్లని నిమ్మరసం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు రావాడ నాగు, వీర మహిళలు కాశీ రాణి, వెంకట్ లక్ష్మి, మండల అధ్యక్షులు వీరబాబు, ప్రసాద్ రెడ్డి, సత్తి బాబు, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, గంగాధర్, జనసేన నాయకులు సుంకర బుజ్జి, సీతారాం, ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించిన బిక్కవోలు జనసైనికులు గోవిందరాజులు, నూతంగి వెంకటరమణ, కొండబాబు, సతీష్, పండు, బాలు యాదవ్, కొర్ల వీరబాబు, భీమశంకర్, కర్రి శ్రీను తదితరులు నిర్వహించారు.