దామోదరం సంజీవయ్య సేవలు అమోఘం

ప్రత్తిపాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య వర్థంతిని ఆదివారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమానులోని జనసేన పార్టీ మండల కార్యాలయంలో కాకుమాను మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి అయన ఎదిగిన తీరు ఆమొఘం అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి సంజీవయ్య అని అన్నారు. జిల్లా సంయుక్త కార్యదర్శి చట్టాల త్రినాథ్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య ఇంటికి జనసేన పార్టీ అధినేత తన సొంత నిధులు కోటి రూపాయలు మంజూరు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ దే అన్నారు. మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయన సేవలు అనితరసాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఉమామహేశ్వరరావు, రెడ్డి నాగరాజు, ప్రతివాడ గంగాధరరావు, యడ్లపల్లి దానారావు తదితరులు పాల్గొన్నారు.