డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డి పల్లి మండలం, తీర్థం పంచాయితీ లో.. డాక్టర్. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా, వారి ఆహ్వానం మేరకు జనసేన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ మాట్లాడుతూ.. అంబేద్కర్ గారి ఆశయాల కోసమే పవన్ కళ్యాణ్ గారు తపిస్తున్నారని.. కుల, మత ప్రస్తావన లేని రాజకీయం చేయడం కోసమే జనసేన పార్టీ స్థాపించడం జరిగింది అని పసుపులేటి దిలీప్ అన్నారు. బైరెడ్డి పల్లి మండల అద్యక్షులు చైతన్య మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో అంబేద్కర్ గారి ఆశయాల కోసం అందరం కలిసి పోరాడాలి అని.. కుల వివక్ష లేని రాజ్యం చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు నాగరాజు, మండల కార్యదర్శులు దేవేంద్ర, సతీష్, తులసి, కృష్ణ, రాజు, జమీర్ తదితరులు పాల్గొన్నారు.