జనసైనికుల సేవాభావం అమోగం: గులకవరపు నరేష్
తాడికొండ గ్రామంలో బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం 6వ రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజలనుంచి వస్తున్న స్పందన చూసి నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని మే నెల మొత్తం కొనసాగిస్తాం అని తెలిపారు. అంతే కాకుండా మండలంలో అన్ని గ్రామాలనుండి జనసైనికులు తమవంతుగా సహకారం అందిస్తున్నారని నిర్వాహకులు గులకవరపు నరేష్, చందు, బాధినేని వెంకటరావు తెలియచేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-09-at-12.28.43-PM-1024x461.jpeg)