శ్రీనివాసరావుతోటలో జనసేన మజ్జిగ చలివేంద్రం

గుంటూరు, శ్రీనివాసరావుతోటలో మజ్జిగ చలివేంద్రాన్ని జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి నిరంతరం సేవలు అందించటంలో జనసైనికులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. వేసవికాలంలో దాహార్తిని తీర్చటం ఎంతో సంతోషకరమైన విషయమని, అందులోనూ ఆరోగ్యకరమైన మజ్జిగను అందించడం ఎంతో అభినందనీయమని గాదె వెంకటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, కొర్రపాటి నాగేశ్వరరావు, ఎర్ర శ్రీను, దాసరి రాము, బావిరెడ్డి హరనాధ్ బాబు, షర్ఫుద్దీన్, బండారు రవీంద్ర, కోనేటి ప్రసాద్, చెన్నా పోతురాజు, కొలా అంజి, శెట్టి శ్రీను, శేషు, ప్రభాకరరావు, రమేష్, మిరియాల రామకృష్ణ, కాసులు, హేమంత్, గౌస్, వడ్డె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.