జోగి నీ అవినీతి బాగోతం బయట పెట్ట మంటావా: ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గానికి నువ్వు ఒక వలస పక్షివి నియోజకవర్గంలో నువ్వు ఉండవు. మైలవరం నుంచి డైలీ సర్వీస్ చేసే నువ్వు కూడా పవన్ కళ్యాణ్ స్థానికత గురించి మాట్లాడుతున్నావ్? ప్రతిపక్షం నాయకుడు ఇంటికి దుమ్మికి వెళ్లి పదవి కొట్టేసావు. ఇల్లు కట్టే మంత్రి అయ్యావ్. నీ పదవి బాధ్యతలు నెరవేర్చి. పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలితే, నీ పాత బాగోతం మొత్తం బయట పెడతా? పెడన నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఇసుక దొంగవి నువ్వు. నువ్వా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది. మడ అడవులు ఆక్రమించుకున్న కబ్జా కబ్జాకోరువు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యానించింది. 16 క్రిమినల్ కేసులు ఉన్న నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ప్రజాస్వామ్య వ్యవస్థకే అవమానకరం. నీకు దమ్ముంటే నియోజకవర్గంలో జరిగే అక్రమాలు గురించి ప్రత్యక్ష చర్చకు సిద్ధమా? అప్పుడు తెలుస్తుంది సంసారం ఎవరో ? వ్యభిచారులు ఎవరో ? మీ నాయకుడు లాగా పవన్ కళ్యాణ్ స్వలాభం కోసం పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేయలేదు. 30 కోట్ల రూపాయలు తన కష్టార్జితాన్ని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఉదార స్వభావం తో ఆర్థిక సహాయం చేస్తున్నారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇస్తూ, రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. కనీసం 30 రూపాయలైనా ఒక్క రైతుకి నీ సొంత డబ్బులు ఇవ్వగలవా? ప్రజాధనాన్ని ప్రజలకే పంచిపెట్టి ఫోటోలు దిగడం కాదు జోగి రమేష్. మీ కష్టార్జితాన్ని (అక్రమార్జన కాదు) పది రూపాయలు అయినా ప్రజలకు సహాయం చేసిన రోజున మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడొచ్చు. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం. 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేసి గెలవగల సత్తా మీకు ఉన్నప్పుడు, ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు? పరిస్థితి చూస్తుంటే మీ భవిష్యత్తు మీకు స్పష్టంగా అర్థం అయిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు భవిష్యత్తులో మీకు 15 సీట్లు కూడా రావు. మీ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు పెడన నియోజకవర్గంలో మీరు చేస్తున్న అక్రమ మైనింగ్ గోతుల్లో పాతి పెట్టడం ఖాయమని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.