సాయి ప్రతాప్ కాలనీ వాసుల సమస్యలను పరిష్కరించండి!

*ఎంపీడీఓ రామచంద్ర రెడ్డి గారికి వినతిపత్రం అందజేసిన జనసేన!
*జనసేన పార్టీ నాయకులు రామా శ్రీనివాసులు

మండలంలోని రాయవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో గల సాయి ప్రతాప్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు రామా శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
రాయవరం-పించ క్రాస్ మధ్యలో ఉన్న సాయిప్రతాప్ కాలనిలో 20 కుటుంబాల వారు నివసిస్తున్నారని చెప్పారు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న రహదారి ప్రమాద సమస్యల పరిష్కారంలో భాగంగా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా.. హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేసి, ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్.టీ.సీ బస్ లను ఆపడానికి బస్ స్టాప్ ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం వాహనాలు రద్దీగా తిరిగే ఈ రహదారిలో 20 రోజుల వ్యవధిలో సుమారు 8 పైగా ప్రమాదాలు జరిగాయన్నారు. అవసరమైతే 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని విచారించి సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సభ్యులు, కాలనీ వాసులు షేక్ మున్నా,షేక్ హాబీబ్, ఇమ్రాన్, జబీబుల్లా, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.