రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
రాష్ట్రపత్తి రామ్నాథ్ కోవింద్ జన్మదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్లు రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో దేశానికి సేవలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ మార్గ నిర్దేశంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. రాంనాధ్ కోవింద్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/10/image-1.png)