రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన పాలూరు బాబు

బొబ్బిలి నియోజవర్గం జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు చేతుల మీదుగా టీం పిడికిలికి సంభందించిన ఆటో మరియు గోడ పోస్టర్లను జనసేన పార్టీ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన రైతు భరోసా యాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు తన కష్టార్జితం 30 కోట్ల రూపాయలు పార్టీ తరుపున ఇవ్వడం దేశ రాజకీయాల్లో మొట్టమొదటి సారి చూస్తున్నాం. ఇలాంటి నాయకుడు మన దేశానికి ఆదర్శం అని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లంక రమేష్, చీమలు సతీష్, గేదెల శివకుమార్, చరణ్, రవి, నాగరాజు, గొల్లపల్లి జనసైనికులు, బలిజిపేట మండలం నాయకులు స్వామి నాయుడు, అప్పలనాయుడు, చరణ్, గౌరీ శంకర్ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.