ముంబై Vs పంజాబ్
ఐపీఎల్ 13వ సీజన్లో 13వ లీగ్ మ్యాచ్లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగుతోంది. గత మ్యాచ్ల్లో అనూహ్యంగా ఓటమిని చవిచూసిన రెండు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని భావిస్తున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఎం అశ్విన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్ చెప్పాడు.
మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది. ఈ సీజన్లో ఇప్పటివరకూ రెండు జట్లు 3 మ్యాచ్ల్లో తలపడగా రెండింట్లో ఓటమిపాలై ఒక్కదాంట్లో విజయం సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో నిలవగా.. ముంబై ఇండియన్స్ ఆరో స్థానంలో ఉంది.