జనసేన పార్టీ కృష్ణ- గుంటూరు జిల్లాల నాయకులతో విస్తృత సమావేశం

కొణిదల నాగబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కృష్ణ మరియు గుంటూరు జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి కృష్ణ మరియు గుంటూరు జిల్లాల వివిధ నియోజకవర్గాల నుండి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నియోజకవర్గంలో నాయకులు పనితీరు గురించి నాగేంద్ర బాబు అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి తన పర్యటన ఉంటుందని తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ బెదిరింపులకు, జనసైనికులు భయపడాల్సిన పని లేదని.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని తెలియజేశారు.
గతంలో పార్టీకి పనిచేసిన ప్రతి ఒక్కరిని కలుపు పోవాలని సూచించారు.

తన నాయకుడు పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని తెలియజేశారు.

పెడన నియోజవర్గం నుండి జనసేన పార్టీ నాయకుడు ఎస్.వి. బాబు ఈ సమావేశంలో పాల్గొని.. పెడన నియోజవర్గం సమస్యలను నాగేంద్రబాబుకు వివరించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని, అక్రమాలను నాగేంద్ర బాబు గారి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్.వి బాబుతో పాటు నియోజకవర్గం నుండి పుప్పల శ్రీనివాస్, బండిరెడ్డి సుబ్రమణ్యం పాల్గొన్నారు.