అగ్ని ప్రమాద బాదితులను ఆదుకున్న యూఏఈ జనసేన

పి. గన్నవరం నియోజకవర్గంలో గంటి పెదపూడి గ్రామం లంక అరిగెలవారి పేటలో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగి 3 పూరిల్లు పూర్తిగా కాలిపోయాయి. బొరుసు నాని ద్వారా విషయం తెలుసుకుని ఆయన ఆధ్వర్యంలో యూఏఈ జనసేన ఎన్.అర్.ఐ పెనుమాల జాన్ బాబు బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి బియ్యం, కూరగాయలు, మరియు నిత్యావసర సరుకులు అందజేశారు. యూఏఈ జనసేన వారితో మాట్లాడి బాధిత కుటుంబాలకు రేకుల షెడ్ నిర్మిస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ల మండల సమ్మెఖ్య అధ్యక్షులు సూరయ్య కాపు, బండి మణికంఠ, బొరుసు నాని, పొలిశెట్టి తరుణ్, బొరుసు వీరబాబు, నంబు రాము, అడ్డాల శ్రీను, అరిగెల నాగేంద్ర, అరిగెల చంటి, శ్రీనివాస్, బుజ్జిబాబు, రవి, రాజు, ఘట్టం రాజేష్ జనసైనికులు పాల్గొన్నారు.