‘బొమ్మ బ్లాక్ బస్టర్’ టీజర్

యువ హీరో నందు, యాంకర్ రష్మీ గౌతమ్ హీరోహీరోయిన్లుగా విజయీభవ ఆర్ట్స్ పతాకంపై నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’. కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో నందు పోతురాజు పాత్రలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వీర అభిమానిగా కనిపించనున్నాడు. ఇక ఫస్ట్ లుక్‌తోనే మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా టీజర్ తాజాగా రిలీజయ్యింది. ఈ టీజర్ లో అన్ని అంశాలు పుష్కలంగా జోడించాడు దర్శకుడు. ప్రముఖ హీరో శ్రీ విష్ణు వాయిస్ బ్యాక్ డ్రాప్ లో ఈ టీజర్ సాగుతుంది.

ఇక ఈ సినిమా గురించి చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ… బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టైటిల్ కి తగ్గట్లుగానే చిత్రం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని, ఈ సినిమాలో నందు, రష్మీ పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయని తెలిపారు. ఈ మూవీకి ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.