చిట్వేలిలో జనసేన మండల స్థాయి సమావేశం

చిట్వేలి: జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్వేలి పట్టణంలో జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవాని కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలపతి కలిసి చిట్వేలి మండలంలో పార్టీ బలోపేతం పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కడప జిల్లా పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్వేలి జనసేన నాయుకులు మాదాసు నరసింహ, మాదాసు శివ, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ శంకర్, సువారపు హరి మరియు తదితరులు పాల్గొన్నారు.