కోనసీమ కార్చిచ్చు జగన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఒక భాగమే..! : పితాని బాలక్రిష్ణ
కోనసీమ లో మంగళవారం జరిగిన అల్లర్ల ఘటనపై రాజమండ్రి లో గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జ్ పితాని బాలక్రిష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. కోనసీమలో జరిగిన విద్వ0సం జగన్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఒక భాగమేనని.. అమలాపురంలో జరిగిన అల్లర్లలో జనసేనకు ప్రమేయం ఉందంటూ.. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/p-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/a48a139e-0d1d-438d-8b04-579946f98a64-1024x473.jpg)