సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పోస్టర్లను ఆవిష్కరించిన పిడుగురాళ్ల జనసేన

పిడుగురాళ్ల జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి వారు ఛాలెంజ్ చేస్తూ రిలీజ్ చేసిన సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల మేలు కోరుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని.. సొంత నిధుల నుంచి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను లక్ష రూపాయలు ఇచ్చి వారి కుటుంబానికి భరోసా కల్పిస్తున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని.. అధికారం లేకుండానే ఇన్ని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అధికారం అందిస్తే ఇలాంటివి మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తారని.. ఏ ఒక్క రైతుకు కూడా ను ఆత్మహత్య చేసుకోకుండా రైతే రాజు అనే నినాదంతో ముందుకు వెళ్తారని.. రాబోయే 2024 ఎలక్షన్లలో అందరూ జనసేన పార్టీని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ దూదేకుల కాసిం సైదా, మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా పోగ్రామ్ కమిటీ సభ్యులు దూదేకుల శ్రీను నాయకులు భయ్యా వరపు రమేష్,పెడకొలిమి కిరణ్ కుమార్, గద్దెన బోయిన సతీష్, శ్రీకాంత్, చిదేళ్ల రామకృష్ణ అశోక్ తదితరులు పాల్గొన్నారు.