పాటంశెట్టి సూర్యచంద్ర ఆమరణ నిరాహార దీక్ష

జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం వెంగయ్యమ్మపురం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు సరైన వేతనం ఇవ్వడం లేదు, నాయకులు, అధికారులు కుమ్మక్కై దొంగ మస్తర్లు వేస్తూ ఇంటి దగ్గర ఉన్నవారికి 250 రూపాయల కూలి వేస్తున్నారు, చెమటోడ్చి కష్టపడి పనిచేసే వారికి 100 రూపాయలు మాత్రమే కూలి వేస్తూ వారి యొక్క శ్రమను దోచుకుని వారికి అన్యాయం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు వచ్చి కష్టపడి పనిచేసే కూలీలకు న్యాయం చేసే వరకు గ్రామ ప్రజలందరి కోరిక మేరకు జనసేన పార్టీ తరుపున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.