టీం పిడికిలి ప్రాజెక్ట్ 2 గోడ ప్రతులు ఆవిష్కరణ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండలంలో జనసేన మండల పార్టీ కార్యాలయంలో సిబిఐ దత్తపుత్రుడికి జనసేన సవాల్..! పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి లక్ష రూపాయలు చొప్పున ఇస్తున్న వారిలో ఒక్కరినీ అయినా రైతు కాదు అని నిరూపించే దమ్ము వైసీపీ కి ఉందా అంటూ టీం పిడికిలి వారు రూపొందించిన పోస్టర్స్ ఆవిష్కరించి.. అనంతరం వివిధ కూడలిలోను మరియు ఆటోలకు అతికించారు.. ఈ కార్యక్రమంలో కిరణ్, మహేష్, వైకుంఠ, నాగేశ్వరరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.