రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా ఆదివారం మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి ఎరుబండి చిన్ని ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా ఈదరాడ జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు. గ్రామ ప్రజలు జనసైనికులను అభినందించారు. ఈకార్యక్రమంలో యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్, నక్కా రామారావు, గుర్లింక గంగాధర్, యెరుబండి చిట్టిరాజా, కటకంశెట్టి శివాజీ, చుట్టగుళ్ళ బుజ్జి, పెదపూడి ప్రసాద్, పెదపూడి త్రిమూర్తులు, రుద్రా తాతజి, యెరుబండి మణి, హంత్, రామకృష్ణ, శ్యామ్, బంగారం, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.