రాజోలు జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్
కోనసీమ జిల్లా, రాజోలు వేసవి కాలంలో నీటి ఎద్దడికి ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ప్రతిరోజు ప్రజలకు మంచినీళ్ళు అందేవిధంగా వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా సోమవారం గొంది గ్రామం మూలగోందిలో నీరు అందక ఇబ్బందులు పడుతున్నవారికి బళ్ళ శ్రీను ట్రాక్టర్ డిజల్ కి ఆర్ధిక సహకారం అందించగా గొంది జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం అన్నారు. ఈ కార్యక్రమంలో గొంది జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-06-at-8.22.53-PM-768x1024.jpeg)