వికలాంగుల నిరసనకి రాయపాటి అరుణ దంపతుల సహకారం

ఒంగోలు, ప్రభుత్వం వికలాంగులకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ వారికి రావలసిన హక్కుల కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పోరాట సమితి మరియు ఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద వికలాంగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి జనసేన పార్టీ తరుపున మద్దత్తు తెలుపుతూ ఒంగోలు నుండి బయలుదేరుతున్న వికలాంగులకి తన సొంత నిధులతో బస్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. ఈ కార్యక్రమంలో అరుణ భర్త చిరంజీవి రెండో డివిజన్ జనసేన ఎస్సి యూత్, మరియు ఎమ్మార్పిఎస్ నాయకులు ఆనంద్ మాదిగ మరియు వికలాంగుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.