పార్వతీపురంలో జనసేన నాయకుల గ్రామ సందర్శన

పార్వతీపురం మండలం, ఎం.ఆర్.నగర్ పంచాయతీలో మంగళవారం పార్వతీపురం జనసేన పార్టీ నాయకులు గ్రామ సందర్శన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ జనసేన నాయకులతో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించడం జరిగింది. గ్రామంలో ప్రభుత్వ భూములు మరియు చెరువులను కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని.. ఈ కబ్జా చెయ్యడం వలన గ్రామనికి వచ్చిన పోస్ట్ఆఫీస్ కి స్థలం కేటాయించకపోవడంతో గ్రామ పేరుతో వేరే గ్రామానికి తరలించడం జరిగింది. గ్రామ పంచాయతీలో యువకులు చదువుకున్నవారు ఎక్కువగా ఉన్నప్పటికీ కనీసం ఒక్క లైబ్రరీ లేకపోవడం మరియు సుమారు 900 గడపలు ఉన్న మా పంచాయతీకి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడంతో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అని జనసేన నాయకుల వద్ద ఆ గ్రామ యువత వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చందక అనిల్ రెడ్డి కరుణ గొర్ల చంటి బంటు శిరీష్ వంగల దాలినాయుడు, సిరిపురపు గౌరి, వంగలపూడి నాని, మనేపల్లి ప్రవీణ్, పైల శ్రీను, లక్మి కాతా విస్సు తదితరులు పాల్గొన్నారు.