మంచి నీటి సమస్యను పరిష్కరించండి: కోడుమూరు జనసేన

కర్నూలు జిల్లా, కోడుమూరు నియోజకవర్గం, గూడూరు నగర పంచాయతీలో ప్రధాన సమస్య అయినటువంటి నీటి సమస్యపై బుధవారం జనసేన పార్టీ తరుపున మున్సిపల్ కమిషనర్(మేనేజర్) మరియు మున్సిపల్ చైర్మన్ లను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడం జరిగింది. దానికి వారు సమస్యపై సానుకూలంగా స్పందించి.. ఈ నీటి సమస్యను త్వరగానే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.