క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: గర్భాన

పాలకొండ నియోజకవర్గంలో జూన్ 12వ తేదీ ఆదివారం శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం జరపబడునని పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడు ఆ రోజు కార్యక్రమానికి హాజరై వారి యొక్క సభ్యత్వం కిట్టు తీసుకోవాలి అని అన్నారు. ఆదివారం నియోజకవర్గ జనసైనికులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని గర్భాన సత్తిబాబు కోరారు.