చలివేంద్రం ద్వారా లెమన్, ఆరెంజ్ జ్యూస్ పంపిణీ చేసిన బిక్కవోలు జనసేన

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలంలో జనసేన పార్టీ అధ్వరంలో ఏర్పాటుచేసిన చలివేంద్రంలో శుక్రవారం కావల వీరబాబు వారి పిల్లల (ముఖేష్, పనిష్) పేరిట రెండవసారి అందించిన సహాయంతో చల్ల చల్లని లెమన్ ఆరెంజ్ జ్యూస్ పంపిణీ చేయడం జరిగినది. ఈ చలివేంద్రంలో జనసైనికులు 37 రోజులుగా.. మండువేసవిలో ప్రయాణికులకు, బాటసారులకు మరియు ప్రజల దాహార్తికి ప్రతీ రోజు సరికొత్త వెరైటీ తో దాహం తీరుస్తున్నారు. ఈ సందర్భంగా వీరికి ఎంతగానో సహకరిస్తున్న దాతలు అందరికీ ధన్యవాదములు తెలియచేయడం జరిగింది. బిక్కవోలు జనసైనికులు అరుణ్ కుమార్ (మండల ఉపాధ్యక్షులు), వడ్లమూడి గోవిందరాజు, సతీష్, కొండ, శ్రీనివాస్, పండు, నాని, మహేష్, శివ తదితరులు పాల్గొని.. ప్రతిరోజు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.