పండుగ వాతావరణంలో విజయనగరం జిల్లాలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ

విజయనగరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం మొదటిరోజైన, శుక్రవారం సాయంత్రం చీపురుపల్లి నియోజకవర్గం, కొండ శంభం గ్రామంలో శుక్రవారం క్రియాశీలక సభ్యత్వాలు చేసిన క్రియాశీలక సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ లుగా విజయనగరం విచ్చేసిన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శిలు గడసాల అప్పారావు, శ్రీమతి ప్రియా సౌజన్య, విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి చేతులు మీదుగా బీమా పత్రాలు ప్రదానం చేశారు.

ముందుగా రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల శ్రేయస్సు, భవిష్యత్ అలోచించి, జనసైనికులకు ఈ ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించారని, అధినేత పవన్ కళ్యాణ్ బంగారం లాంటి జీవితాన్ని వదులుకొని రాష్ట్ర ప్రజలు, యువత భవిష్యత్ దృష్ట్యా మంచి పాలన అందిద్దామని రాజకీయాల్లోకి వచ్చారని, వారివెంట మనమంతా నడవాలని పిలుపునిచ్చారు. మరో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల శ్రేయస్సును ఆలోచించలేదని, ఒకేఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారే.. కార్యకర్తలు శ్రేయస్సు అలోచించి ఈ భీమా సదుపాయాన్ని కల్పించారని అన్నారు. జనసైనికులంతా పవన్ కళ్యాణ్ భావజాలాన్ని, పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలిపునిచ్చారు. జనసేన నాయకులు, జనసైనికులు పార్టీలో అందరినీ కలుపుకొని విభేదాలు లేకుండా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. విజయనగరం ఇంచార్జి పాలవలస యశస్వి మాట్లాడుతూ.. పార్టీలో ఉండే వీరామహిళలుకు, జనసైనికుల కుటుంబాలకు మంచి భరోసాగా ఈ భీమా పధకం పనిచేస్తుందని, క్రియశీలక సభ్యులకు నేరుగా పార్టీ కార్యక్రమాల సమాచారం వస్తుందని తెలిపారు.

అనంతరం విజయనగరం, నెలిమర్ల, గజపతినగరం, ఎస్.కోట,బొబ్బిలి,సాలూరు, కురుపాం, చీపురుపల్లి, పార్వతీపురం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వాలు ఎక్కువ చేసిన సభ్యులకు ఘనంగా సత్కరించారు.