ఘనంగా క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కిట్లు పంపిణీ కార్యక్రమం

ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. తుమ్మలపాలెం గ్రామం వేదికగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం లాంచనంగా ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం మండల జనసేన పార్టీ అధ్యక్షులు పోలిశెట్టి తేజ అధ్యక్షత వహిస్తూ జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైలవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ (గాంధీ) విచ్చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్క కార్యకర్తకి పవన్ కళ్యణ్ గారు భరోసాగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కార్యదర్శి చింతల లక్ష్మి, జనసేన పార్టీ నాయకులు చెల్లు చిన్నస్వామి, తిరుమలశెట్టి పవన్, నాగబాబు, చెల్లు చంటి, శీలం నరేష్, మోహనరావు, బొమ్ము గోపాలకృష్ణ, కొండిశెట్టి నాగమల్లేశ్వరరావు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.