ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ఆమదాలవలస మండలంలో క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లకు సన్మానం చేసి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు బాలమురళి, నరసింహులు,శ్రీను, అశోక్, కోటేష్, గణేష్, సింహాచలం, వెంకీ, రాంబాబు, వీరమహిళలు మరియు జనసేనన కార్యకర్తలు పాల్గొన్నారు.