క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ పంపిణీ చేసిన పితాని

కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికొన గ్రామంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న జనసైనికులకు, వీర మహిళలకు ప్రమాద భీమా ధృవీకరణ పత్రంతో కూడిన క్రియాశిలక సభ్యత్వ కిట్స్ అందజేసిన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంసెట్టి పండు, మండల అధ్యక్షులు మోక బాలప్రసాద్, నూకల దుర్గాబాబు, పెమిడి గంగద్రి, అడపా సాయి, సాంసంని పాండురంగారావు, అంగని రామకృష్ణ, ఓలేటి శ్రీను, సంగాని ధనలక్ష్మి, పిల్లి గోపి, బిమాల సూర్యనాయుడు, బద్రి నాయుడు, అమర సాయి, రంబాల చౌదరిబాబు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.