భవానీ రవి కుమార్ ని సన్మానించిన తాడిపత్రి జనసేన

తాడిపత్రి, రాష్ట్రంలోనే అత్యధిక జనసేన పార్టీ సభ్యత్వాలు నమోదు చేపించి జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి భవానీ రవి కుమార్ ని జిల్లా అధ్యక్షులు టీ సి వరుణ్ సమక్షంలో తాడిపత్రి నియోజకవర్గంలోని జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కలిసి శుభాభినందనలు తెలుపుతూ శాలువా కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి జనసేన పార్టీ నాయకులు కుందుర్తి నరసింహా చారి మరియు చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్, జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యులు కే అల్తాఫ్ మరియు జనసైనికులు అంజి, చోటు తదితరులు పాల్గొన్నారు.