పితాని ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు మరియు క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

కోనసీమ జిల్లా, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో ముమ్మిడివరం నియోజవర్గం ఐ.పోలవరం మండలం గుత్తినదీవి మరియు జి. వేమవరం గ్రామంలో ఏర్పాటు చేసిన క్రియాశీలక కిట్లు పంపిణీ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నుండి అత్యంత ముఖ్యమైన నాయకులు మద్దిశెట్టి పురుషోత్తం ఆధ్వర్యంలో పితాని బాలకృష్ణ సమక్షంలో పడాల నరసింహమూర్తి, నిమ్మకాయల సత్తిబాబు, సాధనాల భాస్కరరావు, సాధనాల పెద్ద నాని, లంకలపల్లి రాంబాబు, కర్రీ చంద్రశేఖర్ వీరితో పాటు సుమారు 100 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, గోదశి పుండరీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి తాళ్లూరి ప్రసాద్, లంకినిపల్లి జమ్మి, గిడ్డి రత్నశ్రీ, బొంతు కనకారావు, మల్లిపుడి రాజ, కొప్పిశెట్టి గణేష్, గంజ శ్రీను, దూడల స్వామి, అడపా సాయి, ఎలమంచిలి బాలరాజు, సవరపు వెంకట్, దేవి రాంబాబు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.