జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

నరసన్నపేట నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లను నియోజవర్గ నాయకుల సమక్షంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శులు బేతపూడి విజయ్ శేఖర్ మరియు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ హజరయ్యారు. ఈ సంధర్బంగా క్రియాశీలక వాలంటీర్లకు జనసేన పార్టీ జెండా మరియు పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసిన ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అతిథులు మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జనసేన పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు చేరవేసే విధంగా అందరూ సహకరించాలని కోరారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా ఒకే లక్ష్యంతో పని చేయాలని జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే విధంగా కార్యాచరణ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నడుపూరి తిరుపతిరావు, పనతల జైరాం, బలగ ప్రవీణ్ కుమార్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.